Thursday, April 30, 2026

ఆశా స్కాలర్ షిప్ దరఖాస్తులు ప్రారంభం..

Share

SBI తన ఆశా స్కాలర్ షిప్ ప్రొగ్రామ్ 3వ ఎడిషన్ ను ప్రారంభించింది. ఆర్ధికంగా వెనకబడి అర్హులైన పదివేల మంది విద్యార్ధులకు దీని ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తోంది. 6వ తరగతి నుండి పీజీ వరకూ విద్యార్ధులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. వారి విద్యాస్థాయిని బట్టి ఏడాదికి పదిహేను వేలనుంచి ఇరవై లక్షల వరకూ స్కాలర్ షిప్ అందిస్తుంది. అక్టోబర్1, 2024 లోపు www.sbifashascholarship.org సైట్ ద్వారా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా దేశం మొత్తంమీద ఇప్పటివరకూ దాదాపు మూడువేల మంది విద్యార్ధులకు రూ.3.91కోట్ల ఆర్ధిక సహాయాన్ని ఎస్ బి ఐ అందించింది.

Read more

Local News