కళ్యాణలక్ష్మీ పథకం కింద చేస్తున్న చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మేడ్చల్, బాలాజీ నగర్, దమ్మాయిగూడ మూడు మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న ఆడపిల్లలకు ఈ పథకం కింద లక్షరూపాలయ చెక్కులను అందించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, బాలాజీ నగర్ మేయర్ శాంతి కోటేశ్, కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే కాలంలో పెళ్లిపందిరిలోనే చెక్కులు అందించే పద్దతి ఉంటే పేదలకు మరింత మంచి జరిగే ఆస్కారం ఉందని ఇందుకోసం ప్రభుత్వం తగిన విధానాలు అమలు చేయాలని కోరుతున్నామని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అన్నారు.

